Monday, December 20, 2010

ఏ మాయ చేస్తావే ... !


‘ఒకటే హృదయం కోసమూ..ఇరువురి పోటీ లోకమూ...’ఏనాటిదో పాట. నిజమే మనసుపడిన దేనికోసమైనా పోటీ తప్పదు...కన్నయ్యకు కన్నతల్లి ఒకరు..ప్రాణం పెట్టి పెంచినది మరొకరు. ఇరువురికీ కన్నయ్య కావాలి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చినట్లు..ఎందుకు ప్రారంభమైనా, ఎలా ప్రారంభమైనా, తెలంగాణా పోరు మాత్రం..హైదరాబాదీలకు ఇబ్బందిగా మారుతుందా? ఉద్యమా లు..కారణాలు..సమస్యలు..పరిష్కారాలు..ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతం..మరి కావాల్సిందేమిటి..చెప్పుకోవాల్సింది ఎంత..తెలుసుకోవాల్సింది ఇంకేముంది?

వీటికి సమాధానంకావాలంటే, హైదరాబాద్ గుండె చప్పుడు మాత్రం వినాలి..ఇక్కడి వారైనా..ఎక్కడి వారైనా..ఈ నగరంతో పెనవేసుకున్న బంధాన్ని చూడాలి..ఈ గుండెచప్పుడు, పెనవేసుకున్న బంధం తెలియాలంటే..హైదారాబాద్ గురించి తెలియాలి. ఈ నగరపు సొగసు తెలియాలి. ఈ నగరపు నయగారం అనుభవంలోకి రావాలి.. ఎంతవారినైన మంత్రముగ్ధుల్ని చేసి, ఇక్కడ నుంచి వెళ్లకుండా చేసే హైదరాబాద్ మాయను తెలుసుకోవాలి. నాలుగు వందలకు పైబడిన చరిత్ర కాదు కావాల్సింది..నిండుగా, హాయిగా ఇక్కడే బతికేయడానికి జనం ఎందుకిష్టపడతారో..తెలియాలి. కష్టంగా వున్నా ఇక్కడ వుండడానికే పడే ఇష్టం ఎందుకో కచ్చితంగా తెలుసుకుతీరాలి.


ఏదో తెలియని మాయె..
ఏదో తెలియని హాయె....
ఇలా మొదలవుతుంది..
హైదరాబాద్‌పై పోలీసు శాఖ
తయారుచేసిన చిన్న డాక్యుమెంటరీ..


హైదరాబాద్...చిత్రమైన నగరం..మరి ఈ మట్టిలో ఏ మాయ వుందో..ఏ సుముహూర్తంలో ఈ నగర నిర్మాణానికి పునాది పడిందో..ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, వ్యాహ్యాళికైనా, ఇక్కడకు ఒకసారి వచ్చినవారు తిరిగి వెళ్లడం అంటే అంతగా ఇష్టపడరు. అందుకే ఇక్కడి జనాభా అంతకంతకూ..అలా అలా పెరిగిపోతోంది. నగరం నాలుగు చెరగులా విస్తరిస్తూనే వుంది.
ఇక్కడి ట్రాఫిక్ పద్మవ్యూహాలను విసుక్కుంటూనే చేధిస్తుంటారు. ఇక్కడ ధరలను తలుచుకుని అమ్మో..అనుకుంటూనే గడిపేస్తుంటారు. ఉరకలు పరుగులు పెడుతూనే వారం అంతా గడిపేసి, వారాంతానికి హుస్సేన్ సాగరతీరానికి చేరి, అన్నీ మరిచిపోయి, మరో వారం గడపానికి తయారైపోతారు.
ఏమిటీ ప్రత్యేకత..ఈ నగరానికి..కేవలం ఇక్కడ లభించే ఉద్యోగాలేనా..ఉపాథి అవకాశాలేనా?మరికేమైనా వుందా..మరే నగరానికి లేని ప్రత్యేకతలేమైనా వున్నాయా? ఏ మహానగరానికైనా ఏముంటుంది? కాస్త ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..దాంతో పాటు పెరిగే జనం..తదనుగుణంగా పెరిగే వ్యాపారాలు.సందడి..అంతేనా..
కానీ హైదారాబాద్ అంతే కాదు..చాలా..
హైదరాబాద్ అంటే ఒక సంస్కృతి..మనకు తెలియకుండానే నగరం పట్ల పెరిగే బంధం..చిత్రమైన నగరం ఇది. నిజానికి విశాఖలోలా విశాల సాగర తీరం లేదు. బెంగుళూరులోలా తక్కువ ఉష్ణ్రోగ్రత లేదు..ముంబాయి విలాసాల జాడ అంతగా లేదు..మరేముంది..
చిత్రమైన నగరం
============
ఒక్క మాటలో చెప్పాలంటే..హైదరాబాద్‌లో ఎవ్వరైనా బతికేయచ్చు. అదే ఈ నగరం ప్రత్యేకత. పెద్దగా బతుకుభయం లేదు. పనికి జడవని వారెరైనా, మూడు వేల నుంచి ముఫై లక్షల ఆదాయం కలిగిన వారైనా సరే ఇక్కడ బతికేయచ్చు. మూడు వేలతో బతుకా అన్న భయం కానీ, ముఫై లక్షలున్నాయి..ఖర్చెలా అని కానీ, బాధ పడడం లేదా బోర్ ఫీలవడం ఎంతమాత్రం అవసరం లేదు. అదే హైదరాబాద్ తొలి స్పెషాలిటీ.
పదిహేను వందలకే పదిమందితో కలిసి ఓ మూల పడుక్కుని, ఉదయపు ఉపాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేయించేందుకు వీలుగా ఇక్కడ హాస్టళ్లున్నాయి. అలాగే అంతకు అంతా లగ్జరీ అందించగల పెయిడ్ హోమ్‌లు, గెస్ట్‌హవుస్‌లు ఇక్కడే వున్నాయి.


అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అనీ..బాధ పడక్కరలేదు. మన దగ్గర ఎంత వుంటే అంతకే రెండూ అందించే సదుపాయం హైదరాబాద్ స్పెషాలిటీ.


మహంకాళీ మార్కెట్ సందులోకి వెళ్లండి..పది రూపాయల డబ్బులకే స్వీట్లు, హాట్లు రోడ్డు పక్కనే కానిచ్చేయడం గమనిస్తారు. అదే బాగా డబ్బుచేస్తే.. తాజ్‌కో, కాకతీయకో వెళ్లండి..అయిదువందల నోటు కాస్త, ప్లేటు పెరుగన్నంగా మారి కళ్లముందుంటుంది. అక్కడే రెండిడ్లీకి వందల్లో రేటు..ఇక్కడే అయిదు రూపాయలకు అయిదు ఇడ్లీ కూడా రెడీ. గోదావరి జిల్లా నుంచి పొట్ట పట్టుకుని వచ్చిన వారు సైకిళ్లపై ఇల్లిల్లూ తిరుగుతూ, జంక్షన్లలో కాపు కాసి, అయిదు రూపాయాలకు, ఆప్యాయత కూడా నిండిన అయిదు ఇడ్లీ అందించడం ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరి కళ్ల పడే వుంటుంది. దటీజ్ హైదరాబాద్.
ఎవరి స్తోమత వారిది. ఎవరినీ నిర్లక్ష్యం చేయదీ నగరం. అందరినీ అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. అందుకే ఈ నగరం అంటే అందరికీ అంత ఇష్టం. పాత బస్తీకి వెళ్లండి..ఆదివారం ఉదయానే్న చార్మీనార్ ఎదుట కిలోమీటర్ మేర కొలువైన పాతవస్తువుల బజార్ చూడండి..ఎంత సందడిగా వుంటుందో. అక్కడ ఆ వస్తువులు చూస్తే..అవి అమ్మకానికా..అసలు ఎవరు కొంటారు..ఎందుకు పనికి వస్తాయి..అనిపిస్తుంది..కానీ అమ్మకాలు సాగుతూనే వుంటాయి..కొనుగోళ్లు జరుగుతూనే వుంటాయి. అదే ఆదివారం సాయంత్రం ఒడిస్సీకో, క్రాస్‌వర్డ్‌కో, సెంట్రల్‌కో, జీవీకె వన్‌కో ఒక్కసారి వెళ్లండి..ఇన్ని రకాల వస్తువులా..ఏ దేశం నుంచి వచ్చాయో, వాచ్ ఖరీదు లక్షా..పెన్ను పాతిక వేలా..అమ్మో..అని కొందరికి అనిపించినా..కొందరికి మాత్రం అవే పదివేలు.
దటీజ్ హైదరాబాద్


ఏ సీజన్ చూడండి..ఏవో రకం. రకరకాల రంగురంగుల పళ్లతో దుకాణాలు ఎంత అందంగా వుంటాయో. రాష్ట్రంలో మరెక్కడైనా మూడు వందల అరవై అయిదు రోజులు ఇంతలా పళ్లు దొరికే నగరం ఒక్కటైనా వుందా? ఇక చిన్నా పెద్దా ఏ బేకరీనైనా చూడండి..ఎన్ని రకాల ఉత్పత్తులో..ఎక్కడి నుంచి వచ్చిందీ అలవాటు? ఒక్క ఈ అలవాటు అని ఏమిటి..ఇరానీ టీ, లుక్మీ, సమోసా, జిలేబీ, పకోడా, బేకరీ బిస్కెట్లు, పళ్లు, డ్రై ఫ్రూట్స్, బిరియానీ,లస్సీ,రుమాలీ రోటీ,హలీమ్, ఇలా ఎన్నో..ఒక దానితో ఒకటి సంబంధం లేని అభిరుచులు. ఉత్తరాది అందామా..దక్షిణాది అందామా..పర్షియన్..ఇరాన్..అనుకుందామా.. ఎక్కడైనా ఒక రకం సాంస్కృతిక అందాలు కనిపిస్తాయి. లేదూ అంటే ముంబాయి లాంటి మహానగరాల్లో ఏరియాని బట్టి లభ్యత, పద్ధతులు మారతాయి. కానీ హైదరాబాద్ అలా కాదు..విభిన్న సంస్కృతుల, పద్ధతుల, అలవాట్ల సమాహారం. ఇక్కడ అందరూ అన్నింటినీ ఇష్టపడతారు. అందరూ అన్ని రకాలను ఆస్వాదిస్తారు. రాజస్ధానీ, గుజరాతీయులు తెచ్చిన జిలేబీ, ఖాండ్వీ,్ఢక్లా..ఇరాన్ నుంచి వలస వచ్చిన హలీమ్, ఉడిపి హోటళ్లు అలవాటు చేసి ఇడ్లీ, వడ, దోశ, ఇంకా ఎందరో వచ్చి, ఎన్ని రకాలు అలవాటు చేస్తే, అన్నింటినీ అక్కున చేర్చుకోవడం హైదరాబాదీల మంచి మనస్సుకు నిదర్శనం.


సరే ఆహారం అలవాట్లు అలా వదిలేద్దాం. బతుకు పోరు చూద్ధాం.


ఎవరికి నచ్చిన దారి వారిది. ముందు వచ్చిన వారు చూపించిన తోవనే వారి వెనక వచ్చిన వారు నడిచి పోయేది. ఏనాడు వచ్చారో.. కన్నడిగులు. ఇవ్వాళ హైదరాబాద్, సికిందరాబాద్ నగరాల్లో నూటికి తొంభై పార్లర్లు వారివే. ఇరాన్ నుంచి వచ్చిన వారెందరో..ఆ పరంపర నేటికీ ఇరానీ టీలు, రెస్టారెంట్లు గా వర్ధిల్లుతూనే వుంది. ఇక సికిందరాబాద్ వర్తకమంతా నాలుగింట మూడు రెట్లుకు పైగా ఉత్తరాది వారిదే. మన పశ్చిమగోదావరి వాసులదే కొబ్బరి బొండాల వ్యాపార గుత్త్ధాపత్యం. నగరం నలుచెరగులా ఎక్కడ బొండాం తెగినా, కొట్టిన కత్తి పట్టిన చేయి గోదావరి జిల్లా వాడిదే. సైకిళ్లపై పచ్చళ్లు, టిఫిన్లు తూర్పుగోదావరి వాసులకు ఉపాధి కల్పనే. పాతబస్తీ వ్యాపారం అంతా మన ముస్లిం సోదరుల సముపార్జనే. ఇక అమీర్‌పేట అంతా కంప్యూటర్ శిక్షణాకేంద్రాలే. ఇక్కడ ఇట్టే నేర్చేసుకుని, అటు హైటెక్ సిటీవైపు అట్టే ఉద్యోగం పట్టేసే వారెందరో. ఆ జిల్లా..ఆ జిల్లా...ఈ రాష్ట్ర..ఆ రాష్ట్ర అని లేదు..ఎక్కడెక్కడి వారో, ఎవరెవరు కన్న బిడ్డలో..ఇక్కడకు వచ్చి, ఈ సంస్కృతికి, ఈ సరదాకు బానిసలై, ఇక్కడే వుండిపోయేవారు. వచ్చే వారు వస్తుంటే, ఉపాధి అవకాశాలు పెరుగుతూనే వున్నాయి కానీ తరగడం లేదు. ఎందుకని..ఇక్కడ దొరకని వస్తువు లేనట్లే..తయారవని సరుకు లేదు. నిజం హైదరాబాద్‌లో అన్ని రకాల సామగ్రి తయారవుతుంది. జోళ్లు,తోలు వస్తువులు, ఫ్యాన్లు, మిక్సీలు, కూలర్లు, బిస్కట్లు, ఇంకా ఎన్నో..ఎన్నో వస్తువులు హైదరాబాద్‌లో తయారై, పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్టుపై సరాఫరా అయి, పేరు మార్చుకుని, దేశం నలుమూలలా అమ్మకాలకు సిద్ధమవుతాయి. అన్నీ హైదరాబాద్ నలుమూలలా వున్న కర్మాగారాల్లో రూపుదిద్ధుకున్నవే. ఇక్కడి జనం పనితనం అటువంటిది. రాదు..తెలియదు..కాదు..అన్నది ఇక్కడ వినపడదు..మనం చెప్పగలగాలి..ఎలా కావాలో..ఏం కావాలో..అలా చేసేయగల నేర్పున్న జనం, అలా చేయడానికి కావాల్సి సామగ్రి అందించే మార్కెట్లు..హైదరాబాద్ స్వంతం. 


నిజం...కావాలంటే బేగం బజారే సాక్షి.

పలెట్లూర్లో దంపుడు బియ్యం దొరక్కపోవచ్చు. హైదరాబాద్‌లో రెడీ. వెండి, రేకులు స్వీట్లకు అద్దుకుతినడం సాధ్యం కావాలంటే చార్మినార్ దాటి పదడుగులు వేస్తే సరి. ఇళ్ల అందాలకు, ఇంటి సామగ్రి సొగసులకు అందమైన కార్వింగ్ పని చేయాలంటే హైదరాబాద్ కళాకారుల తరువాతే. కాలు పెట్టడానికి సైతం కనీసార్హత ఉండాలనిపించే కోట్లకు పడగలెత్తిన దుకాణాలు ఇక్కడ..కాలి నడకన తప్ప లోపలికి వెళ్లలేని కోఠీ, మోండా మార్కెట్లు ఇక్కడే. కొత్త పుస్తకం మార్కెట్‌లోకి వచ్చిన మూడో రోజునే అబిడ్స్ సెకండ్స్ మార్కెట్‌లో ప్రత్యక్షం. అక్కడ అయిదు వందలు..ఇక్కడ యాభై. ఏనాదో రామాయణం..మరే నాటిది సాహితీ సౌరభం..ఏదైనా సరే ఆదివారం ఇటు అబిడ్స్ నుంచి అటు కోఠీ మీదుగా చిక్కడపల్లి వరకు పేవ్‌మెంట్లపై కొలువుతీరుతాయి. కుర్రకారు నుంచి కవుల వరకు, పాఠశాల విద్యార్ధుల నుంచి, పరిశోధకుల వరకు అక్కడ అలా దేనికోసమో..వెదుకుతూనే వుంటారు.
ఇక సరే ఆహారం..వ్యాపారం..ఉపాధి..ఓకె. మరి రవాణా..
అదేం చిత్రమో..హైదరాబాద్ ఆంధ్రదేశానికి ఒక మూల వున్నా..ఒక్క రాత్రి చాలు..ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎగిరిపోవవడానికి. ఆ మధ్య ఓ ఆంగ్ల పత్రిక..చిన్న స్పెషల్ డైరక్టరీ ముద్రించింది. అతి తక్కువ వ్యవధిలో హైదరాబాద్ నుంచి చూసి రాదగ్గ ప్రదేశాలు అంటూ..చిత్రమేమిటంటే..ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలే కాదు కదా..పక్క రాష్ట్రాల ముఖ్య ప్రాంతాలన్నీ ఆ జాబితాలో వున్నాయి. నిజమే కదా..సాయంత్రం ఆరు గంటల వేల బయల్దేరితే..బెంగుళూరు, బొంబాయి, మద్రాసు, విశాఖ, తిరుపతి, షిర్డీ..ఇలా ఒకటేమిటి ..వందలాది ఊళ్లకు తెల్లారి సూరీడు తొంగి చూసేలోగా చేరిపోవచ్చు. ఇది రైలు..బస్సుల సంగతైతే..మరి విమానలైతే.. ఖండాంతరాలే దాటేయచ్చు..శంషాబాద్ నుం చి రెక్కలు తొడిగిన లోహవిహంగాలు అలా అలుపులేకుండా ఎగురుతూనే వుంటా యి కదా..


ఇంత మంచి సదుపాయం వున్న ఊరును ఎవరు వదులుకుంటారు..బతుకు కోసం..

సరే బతుకు తెరువు, ఆదాయం, ఎవరి స్ధాయికి వారు ఖర్చు చేసుకునే అవకాశం..ఇంకా ఎన్నో వున్నాయి..
మరి కాలక్షేపం.. పదిమంది ఉన్న చోట మరి దానికేం లోటు. ఒక్క ఇరానీ రెస్టారెంటు చాలు..ఓ పూట గడిచిపోవడానికి. అలా అలా.. కబుర్లు రాలుతూనే వుంటాయి, టీ, సిగరెట్ పొగల నడుమ.
పెళ్లాం పిల్లలతో షికార్లకు ఎన్ని తావులున్నాయో..అందరికీ తెలిసిందే.
ఇన్ని సదుపాయాలతో పాటు ఎన్నో బాధలూ వున్నాయి.
ట్రాఫిక్, నీళ్లు, వేడిమి, ధరలు, ఇళ్లు..ఇంకా అప్పుడప్పుడు కర్ఫ్యూలు.. అయినా ఇక్కడ బతికే జనానికి అవేం పట్టవు.
అవి ఇక్కడ జన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. వాటిని ప్రత్యేకంగా గమనించుకోరు..గుర్తుంచుకోరు.
వాటితో కలిసి బతకడమే వారికి అలవాటు..అదే వారికి ఇష్టం.
హైదరాబాదీల మరో ప్రత్యేకత..బాధ..్భయం..రేపటిపై ఆలోచన కనపించని చిత్రమైన పద్ధతి. అందరిలోనే ఏదో కులాసా..ధలాసా తనం..దూసుకుపోయే మనస్తత్వం..ముఖ్యంగా కుర్రకారులో. కొత్తగా వచ్చిన ఇంజనీరైనా..దుకాణంలో చేరిన కుర్రకారైనా..ఒకటే తరహా స్టయిల్. పాతవారికీ పరిచయం..కొత్తవారికి కొద్ది రోజుల్లోనే అలవాటు..ఈ హైదరాబాద్ వాతావరణం..అదో మత్తు..గమ్మత్తు. అందుకే ఆ మత్తుకు, గమ్మత్తుకు దూరం కావడం ఎవరికీ ఇష్టం వుండదు. అందుకే అందరికీ కావాలి..
ఈ నగరం.. అందరూ హైదరాబాదీలే.. **

===========================
260 చదరపు కిలోమీటర్లకు పైగా....

 

హైదరాబాద్ నాలుగు శతాబ్ధాల కిందట నిర్మితమైన సుందర నగరం. ఆనాడు కేవలం మూసీ నది పరీవాహక ప్రాంతానికే పరిమితమైన ఈ నగరం కాస్తా ఇవ్వాళ నలుచెరుగులా అద్భుతంగా విస్తరించింది..ఇంకా విస్తరిస్తోంది. ప్రస్తుతం 260 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి వుందీ నగరం. సుమారు 60 లక్షల జనాభా. నిత్యం వేలాది మంది వలసదారులతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. సముద్రమట్టానికి 536 మీటర్ల ఎత్తున వున్న ఈ నగరపు వాతావరణం చాలా చిత్రమైనది. ఉష్ణోగ్రత, వర్షపాతం, చలి మూడూ కాస్త ఎక్కువే. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత నలభై అయిదు దాటడం, అలాగే శీతాకాలంలో పది డిగ్రీలకు పడిపోవడం, వర్షాకాలంలో అత్యధిక వర్షాలు హైదరాబాద్ స్పెషాలిటీ. అయినా గాలిలో తేమశాతం తక్కువ కావడంతో ఇక్కడ జనానికి అలసట కాస్త తక్కువగా అనిపిస్తుంది. దాని వల్ల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు అంతగా బాధించవు.
=========================
ఎన్నో వస్తువుల తయారీ.....

 

హైదరాబాద్ బ్రాండ్..ఈ పేరుతో ఏ వస్తువూ తయారుకావడం లేదు కానీ, చాలా వాటికి హైదరాబాద్ పెట్టింది పేరు. బిరియానీ, హలీం తదితర వంటకాలకు వున్న పేరు ప్రత్యేకంగా పేర్కొనక్కరలేదు. ఈ సంగతి ఇలా వుంచితే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు విక్రయించే వస్తుసామగ్రి హైదరాబాద్‌లోనే తయారవుతుంది. మస్కిటో కాయిల్స్, ఫ్యాన్లు, మిక్సీలు, ఎయిర్ కూలర్లు, చెప్పులు, షూలు, బేకరీ ఉత్పత్తులు, చాక్‌లెట్లు, ఇలా ఇంకా ఎన్నో వస్తువులు ఇక్కడి సంస్థలు తయారుచేసి, పెద్ద పెద్ద కంపెనీలకు అందిస్తే, వాటి బ్రాండ్‌నేమ్‌తో అవి మార్కెట్‌లోకి వస్తాయి. ఈ కారణంగా అనేక మందికి హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పారిశ్రామిక, ఉపాధీకరణ అవకాశాలు పెరగడం వల్లనే ఇక్కడకు నిత్యం వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.

- వి.ఎస్.ఎన్.మూర్తి


Tuesday, November 9, 2010

Hyderabad in Photographic Memories


Char Minar
1 The Char Minar

The City of Hyderabad in central India may seem an unlikely city to be the subject of a postcard related article but it is a very interesting city, steeped in history famous for its minarets and its pearl bazaar. Pearls from all over the world are said to come to Hyderabad because the artisans of the city are skilled in piercing and stringing pearls without damaging them.
The British first had a presence in the city during the 18th century and it was here that the most wonderful love story, as retold by William Dalrymple in his book ‘White Mugals’ testifies. After arriving in the city the first British Resident, Lieutenant Colonel James Kirkpatrick (resident between 1797 and 1805) fell in love with the great niece of the Diwan (or Prime Minister) Khair-Un-nissa and married her in 1800 according to Muslim law. This caused great scandal in British India and really put Hyderabad on the map.


This card shows the Char Minar, (four pillars) the symbol of Hyderabad . It was built between 1591 and 1612 by the Sultan Mohammad Quli Qutb Shah to commemorate the eradication of plague from the city. It stands 186 feet tall, a showpiece in the centre of the city. Originally it stood at the entrance to the Palace complex and today marks the entrance to the main bazaar. There is a beautiful mosque on the second floor and a large water tank in the middle.
The colourful Lad Bazaar lies on the right of Charminar, in the Old City. One of the oldest shopping centres in the city; it is an amazing mix of ancient and modern. It's shops offer an assortment of henna, bridal wear and cosmetics. But the real draw is the exquisite range of lac and glass bangles, the pride and joy of the women of Hyderabad.
Street Scene, Hyderabad
2 Street Scene Hyderabad
Today Hyderabad is the fourth largest city in India. It can be found on the top of the Deccan Plateau, 1776ft above sea level in central India. It is the capital of the state of Andhra Pradesh along with its twin neighbour Secunderbad .
The city was originally founded on the southern bank of the River Musi (a prime military position) five miles east of Golconda, between 1591-92 by Muhammad Quli Qutb Shah, who named it after his wife. The streets were laid out in a grid like pattern spanned by enormous arches and lined with stone buildings providing shops at ground level with living accommodation above. Many of these original buildings still stand today. During the 16th century the city grew to accommodate the surplus population of Golconda and over time Hydreabad expanded north across the bank of the river.

This card shows a view looking across the main street in the Old Town to the Char Minar and the Mecca Masjid to the right (built with single slabs of granite as well as a few bricks brought from Mecca which were implanted in the walls of its main arch, giving the mosque its name). There are about 450 shops flanking either side of the Char Minar with around 2500 craftsmen many of whom weave dazzling sets of Hyderabadi bangles. 

Falaknama Castle
3 Falaknama Castle
From 1724 until India’s independence in 1947 Hyderabad was ruled over by a succession of muslim Nizams (seven in all) and under their rule Muslims were encouraged to come and work in the Court from Northern India as well as abroad. This gave the city its highly cosmopolitan feel.

This card shows the outside of the Falaknama Castle or Palace – originally a noblemans house built over a period of seven years in a mixture of styles by an Italian architect. It was completed in 1873 and was subsequently given to the Nizam as a gift. It stands on top of a 200 ft high hill and is laid out in the shape of a scorpion. There are 220 lavishly decorated rooms and 22 spacious halls. The palace has some of the finest treasures collected by the Nizam including paintings, statues, furniture, manuscripts and books as well as one of the largest electrical switchboards in India. The ballroom contains a two-ton manually operated organ said to be the only one of its kind in the world. 

4 The Residency

4 The Residency
By the end of the 18th Century British and French traders were vying over this part of India and were on a constant look out for alliances with regional powers. The British East India Company came to an agreement with the Nizam (Ali Kahn) in which he accepted British support and allowed the establishment of a British Residency whist still retaining the power to rule himself. In exchange the British gained trading rights to the area. This led to an area north of what is now the Hussain Sagar lake being established as a cantonment. The area was named Secunderabad after the then Nizam, Sikander Jah. Both Hyderabad and Secunderabad grew together and have now merged. An imaginary line drawn across the Tank Bund is still used to distinguish the two cities. So Hyderabad became the capital of what was to be the largest of the 550 Princely states of India, roughly the size of France whist still keeping independence of a sort. It still had its own currency and mint, railways and postal service as well as the luxury of no income tax!

This card shows the British Residency built by the Resident Lieutenant Colonel James Kirkpatrick between 1797 and 1805. It lies just over the river from the old city. The building is a vast palatial villa within a massive fortified garden. Today, despite falling into ruin, it houses the Osmania Women’s College. It is now recognised as one of the most important colonial buildings in India and has recently been put on the World Monument Funds list of 100 most endangered buildings. 

5 H.E. The Nizam
5 H.H. The Nizam
Mir Osam Ali Khan, the seventh and the last Nizam of Hyderabad ruled between 1911 to 1948. Soon after India gained independence in 1947, all the princely states were invited to join the Republic. However the Nizam was reluctant to do so because of the links he had with the Islamic world (inc Persia) and the tradition of political power. He hoped that Hyderabad might gain independence from India and join forces with the newly formed Pakistan; but in 1948, after Police Action, his state was merged into the Indian Union and the state of Andhra Pradesh was formed. The Nizam moved to Australia. Mir Osman Ali Khan, the last Nizam, died on Friday 24 February 1967. It was the end of the princely era.

This card shows the 6th Nizzam Mahboob Ali Khan, posing with three tigers presumably shot by him, the card was sent to the UK in 1912, the writer laments that there are no tigers in Poona but he hopes to return to Kanwar where he hopes to shoot one..

6 Hossein Sagar Lake Canal
6 Hossein Sagar Lake Canal

The Hossain Sagar Lake Canal is a large lake in the middle of the city and was constructed in 1562 A.D. The Tank Bund links the twin cities of Hyderabad and Secunderabad. Toady there is a broad road along its perimeter, which is lined with lawns and 33 statues of famous personalities of the State.



7 Golconda Tombs
7 Golconda Tombs

This card shows the cluster of magnificent tombs erected in memory of the departed kings of Golconda, they lie twelve kilometres from Hyderabad They were built in a unique architectural style which is a mixture of Persian, Pathan and Hindu forms out of grey granite, embellished with stucco ornamentation. Each tomb stands on a wide quadrangular terrace approached on all sides by flights of steps. Amonst the tombs are those of the six Qutb Shahi Kings but the most spendid is the tomb of the fifth king of the Qutb Shahi dynasty and founder of Hyderabad - Mohammed Quli Qutb Shah. It is 42.5 metres high with a large dome and 28 open arches; his tomb is one of the largest and most imposing of monuments and can be seen in the centre of the card.

8 Trimulgherry Police Station

8 Trimulgherry Police Station

Trimulgherry Fort was built in the cantonment of Secunderabad and was completed in 1867. Its outer walls were surrounded by a moat, almost three miles in circumference. The fort once had barracks, arsenals, stables, mews, mess houses, and military offices inside. The Army still has a substantial presence in Secunderabad toady and Winston Churchill was posted here during the 1880s as a subaltern. This card shows the Police Station within the Fort with the native policemen lined up for the photographer.
9 Commander in Chief Hyderabad (Deccan)

9 Commander in Chief Hyderabad (Deccan)

This card shows the Commander in Chief Hyderabad (Deccan) sitting on his horse. In 1902 Kitchener became Commander-in-Chief India and this could well be him posing for the camera.

10 Nizam von Hyderabad

10 Nizam von Hyderabad

This early French card shows the 6th Nizzam Mahboob Ali Khan a ‘Souvenir of East Indies’ (1869-1911). The card itself was posted in 1909.

11 The Queen Empress

11 The Queen Empress

The Queen Empress as shown in this Tuck series shows Her Most Gracious Majesty Victoria Mary, Consort to King George V, who was the emperor of India. The card was published to celebrate the Coronation Durbar in Delhi December 12th 1911. It shows the crown, set entirely with diamonds, and was especially made for the occasion. It originally contained the famous Koh-I-Noor diamond (which is now set in the Queen Mother’s crown) . This famous diamond was originally found at Golconda Fort on the outskirts of Hyderabad. The Fort was founded originally in the 13th century and after renovations during the following century it was fortified with granite walls and ramparts. The fortress city within the walls was famous for the diamond trade and the Koh-i-noor diamond is said to have come from here. Since its arrival in England the Consort has only ever worn it.
by Liz Mckendrick

Chandulal's Car, Bolarium, Hyderabad

In the Mosque of Machii-Kaman

One Tree Hill, Secundarabad

H.H. The Nizam Leaving the Residency, Hyderabad.

Tombs at Golconda, Hyderabad

Tombs of the Kings of Golcond

Golconda was the capital of the former princely state of in Hyderabad

Golconda is famous for the magnificent Golconda Fort. An early steel engraving of India. 

Bara Bazaar. Hyderabad, Dn. [Deccan

Hyderabad is known for its rich and varied culture and history reflected in its temples, monuments and mosques

Today Hyderabad is one of the most modern and well-developed cities in India and a center of the information technology revolution. During the Raj, Hyderabad State or what is now Andhra Pradesh was ruled by a Muslim Nawab who was purported to be the richest man in the world.

James Bazaar Street, Secunderabad.

Secunderabad, the twin city of Hyderabad, is separated from the state capital by Hussain Sagar, a man-made lake

In the pre-independence era, Mahatma Gandhi Road or today's M.G. Road was known as James Street and it was the major commercial thoroughfare for Secundarabad.

 

 

 



 

 

Saturday, October 30, 2010

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా .........


నల్లగొండ జిల్లాతో కలిపి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చునని వచ్చిన వార్తపై తీవ్ర దుమారం చెలరేగింది. ఎకనమిక్స్ టైమ్స్ లో వచ్చిన ఈ వార్తాకథనాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి  (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఓ సమావేశంలో బయటపెట్టి, ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. ఆ ప్రతిపాదనపై నిప్పులు చెరిగారు. హైదరాబాదు లేని తెలంగాణ  తల లేని మొండెం అన్నారు. తెలుగుదేశం  తెలంగాణ ప్రాంత నాయకులు హుటాహుటిన శ్రీకృష్ణ కమిటీకి తన వ్యతిరేకతను తెలిపారు. ఇంతగా సంచలనం కలగడానికి కారణం లేకపోలేదు.


హైదరాబాదు తెలంగాణ ప్రాంతానికి చారిత్రకంగా రాజధానిగా ఉంటూ వస్తోందని, పైగా అది తెలంగాణ నడిబొడ్డున ఉందని, అందువల్ల తెలంగాణ నుంచి హైదరాబాదును వేరు చేయడం కుదరదని తెలంగాణవాదులు అంటూ వస్తున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాదు వేరు చేయడం భౌగోళికంగా సాధ్యం కాదని ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటూ వచ్చారు. అది సాధ్యమనే విషయం తాజాగా తెలిసి వచ్చింది. పైగా, అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక సమర్పిస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ పదే పదే అంటుండంలోని ఆంతర్యం తెలిసి వచ్చినట్లయింది. సీమాంధ్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్ర్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే. హైదరాబాదు కోసమే వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేస్తే ఆ వ్యతిరేకత రాదు. సీమాంధ్రుల నుంచి వ్యతిరేకత రాకుండా చూడడానికి అదే మందని శ్రీకృష్ణ కమిటీ ఆలోచనలో ఉండవచ్చు. దానికి తెలంగాణవాదులను ఒప్పించడం కూడా పెద్ద కష్టం కాదని అనుకుంటూ ఉండవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే, భౌగోళికంగా హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి గల అవకాశాలను చూద్దాం.

తెలంగాణవాదులు అంగీకరిస్తారా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి భౌగోళికంగా సాధ్యమయ్యే పనే. అయితే, నల్లగొండ జిల్లా మొత్తం దాంట్లోకి వచ్చే అవకాశం లేదు. హైదరాబాదుకు, కోస్తాంధ్రకు మధ్య తెలంగాణ రాష్ట్రం ఉండకుండా చూడడమే కావాల్సింది. హైదరాబాదు నుంచి రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ కృష్ణా జిల్లాలోని జగ్గయ్య పేట వరకు, మరో వైపు గుంటూరు జిల్లా సరిహద్దుల వరకు కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి వీలవుతుంది. భౌగోళికంగానే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కూడా ఆ వాదనకు బలం చేకూరే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగుడా వంటి ప్రాంతాల్లోకి కోస్తా వలసలు విరివిగా సాగాయి. కోస్తాకు చెందిన పలువురు చాలా కాలం క్రితమే వలస వచ్చి స్థిరపడిపోయారు. సంపన్నులుగా ఎదిగారు. నాగార్జున  సాగర్ కాలువ కూడా వస్తుండడంతో మిగతా మెట్టప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతాలు కాస్తా సస్యశ్యామలంగా ఉంటాయి. హుజూర్ నగర్ ప్రాంతంలో 11 దాకా సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. చాలా ఫ్యాక్టరీలు కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు చెందినవే. ఆ రకంగా ఆ ప్రాంతంలో కోస్తా వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అక్కడి సంస్కృతి కూడా కోస్తా ప్రాంత సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల కూడా తెలంగాణ నుంచి నల్లగొండ జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని విడదీయడానికి అవకాశం ఉందనే వాదనను ముందుకు తేవచ్చు.


భౌగోళికంగా, సాంస్కృతికంగా నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి తగిన అవకాశాలు ఉన్నాయనే వాదనకు ఏదో మేరకు బలం చేకూరుతుంది. అందువల్లనే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు ఎకనమిక్ టైమ్స్ వార్తాకథనంపై అంత తీవ్రంగా ప్రతిస్పందించారని భావించవచ్చు.

ఇంచీ కూడా ఇవ్వం
హైదరాబాద్ లేకుంటే తలలేని మొండమే..56 నాటి తెలంగాణ ఇవ్వాల్సిందే: కేసీఆర్

యూటీకి ఒప్పుకోం.. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం: కాంగ్రెస్, టీడీపీ నేతలు
రాజధానిపై అప్పుడే రగడ.. 'ఐదు ఆప్షన్లు' అంటూ ఆంగ్ల పత్రిక కథనం
ఖండించిన కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్.. ఢిల్లీలో రాజుకుంటున్న 'ప్రత్యేక' వేడి
రాష్ట్రం ఇవ్వకుంటే సీఎం ఇంటికి కరంట్ కట్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు
హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిది. 1956లో ఏ తెలంగాణను ఆంధ్రలో కలిపారో... అదే తెలంగాణ కావాలి. ఇంచి తగ్గినా ఒప్పుకోం.
- కేసీఆర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు


హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం. ఎస్సార్సీలోనూ ఇదే విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్‌లేని తెలంగాణను ఊహించుకోలేం.
- టీడీపీ తెలంగాణ నేతలు


ఐదు జిల్లాల్లో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. హైదరాబాద్‌ను యూటీ చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. ఆ ఆలోచన మానుకోవాలి.
- కాంగ్రెస్ తెలంగాణ నేతలు


హైదరాబాద్‌ను యూటీగా సూచిస్తున్నామని ఎందుకు వార్తలు పుట్టిస్తున్నారో అర్థం కావడంలేదు. మేం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తాం.
- కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్


కలిపి ఉంచాలా? వేరు చేయాలా? ఈ విషయం ఇప్పటిదాకా తేలనే లేదు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ దీనిపై ఏం చెబుతుందో తెలియదు. కమిటీ సూచించే 'ఆప్షన్స్'లలో కేంద్రం దేనిని ఎంచుకుంటుందో ఎవరికీ తెలియదు. కానీ... అప్పుడే 'రాజధాని'పై రగడ మొదలైంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చూపబోయే పరిష్కార మార్గాల్లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా ఉందని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనమే దీనికి కారణం.


కేంద్రం ముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఐదు ఆప్షన్లు ఉంచే అవకాశముందంటూ ఈ పత్రిక వెల్లడించింది. దీనిని... కమిటీ సభ్యకార్యదర్శి దుగ్గల్ నిర్ద్వంద్వంగా ఖండించారు. "హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా ఉమ్మడి రాజధానిగా ఉండాలని మేం సూచిస్తున్నామని ముందే ఎందుకు వార్తలు పుట్టిస్తున్నారో అర్థం కావడంలేదు. మేం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తాం. అంతిమంగా కేంద్రం నిర్ణ యం తీసుకుంటుంది'' అని తెలిపారు.


అయి తే... అప్పటికే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 'కేంద్ర పాలిత ప్రాంతం'పై మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలూ దీనిపై స్పందించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ముక్తకంఠంతో నినదించారు. "నల్లగొండ జిల్లాతో కలిపి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయనున్నట్లు కథనం వచ్చింది. దీనిని అంగీకరించేది లేదు. 1956లో ఏ తెలంగాణను ఆంధ్రలో కలిపారో... ఆ తెలంగాణే కావాలి. దానికి ఇంచి తగ్గినా అంగీకరించేది లేదు'' అని కేసీఆర్ తేల్చిచెప్పారు.


'హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ బోర్డు' ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమావేశంలోనూ సర్కారుకు హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే... సీఎం నివాసంతో సహా మొత్తం పది తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పలువురు ప్రతినిధులు ప్రకటించారు.


మరోవైపు... 'డిసెంబర్ 31' సమీపిస్తుండటంతో ఢిల్లీలో తెలంగాణ వేడి రాజుకుంటోంది. ఈ చర్చల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు ప్రణబ్, చిదంబరం, వీరప్ప మొయిలీలతో చర్చించారు. దుగ్గల్‌తోనూ గవర్నర్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు, భవిష్యత్‌లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

Friday, September 24, 2010

చిత్రకళ, ఛాయాచిత్రకళా లోతులతో పాటు జీవితపు సుడిగాలులను కూడా సమానంగానే తాకిన గుడిమళ్ల భారత్‌భూషణ్

చిత్రంగా మళ్లీ చేతికొచ్చిన కుంచె

ఇష్టంగానో అయిష్టంగానో ఓ నావను ఎక్కేసి నడిసముద్రంలోకి వెళ్లాక, ఉన్నట్లుండి నావ మునిగిపోవడం మొదలెడితే ఏం చేస్తాం? తాచుపాముల్లా నీళ్లు నావలోకి తన్నుకు వస్తుంటే ఏం చేయగలం? నావలోంచి దూకేయాలనిపించడం సరే కానీ, దూకేశాక నడి సముద్రంలోంచి తిరిగి ఒడ్డుకు చేరేదెలా? ప్రాణాలు నిలవాలంటే ఆ సమయంలో ఏదో ఒక ఆలంబన కావాలి.

కానీ, ఎవరా ఆలంబన? ఏమిటా ఆధారం? పాతికేళ్లుగా ఉన్న ఫొటోగ్రఫీ వృత్తిలో ఇక కొనసాగడం సాధ్యం కాదని వదిలేయవలసిన స్థితికి అసలు కారణమేమిటి? ఎప్పుడో టీనేజ్‌లో ఎంతో వ్యధతో దూరం చేసుకున్న చిత్రకళను తిరిగి గుండెలకు హత్తుకున్న వైనమేమిటి? చిత్రకళ, ఛాయాచిత్రకళా లోతులతో పాటు జీవితపు సుడిగాలులను కూడా సమానంగానే తాకిన గుడిమళ్ల భారత్‌భూషణ్ జీవన చిత్రం ఆయన మాటల్లోనే...


ఏదో అనుకుని మరేదో అయిపోవడం మానవ జీవితంలో అరుదేమీ కాదు. బతుకు మార్గాల్లోకి చూసినా చాలా వరకు మనం అభిలషించేదీ, అమితంగా ప్రేమించేదీ ఒకటైతే, మనం బంధీ అయ్యేదీ, వెంటబడి వెళ్లేదీ మరొకటవుతూ ఉంటుంది. ఇది నాదారే కాదని అప్పటిదాకా ఘోషించిన మనసే నిస్సహాయంగా మరెవరో నిర్ధేశించిన లక్ష్యాన్ని స్వీకరిస్తుంది. నా విషయంలో జరిగిందీ ఇదే.... వరంగల్ మా స్వస్థలం.

నేను 10వ తరగతి చదివే రోజుల్లో అంటే 1969లో తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. క్రమంగా ఉధృత మయ్యింది. పెద్దవాళ్లంతా ఉద్యమంలో పాల్గొనే వారు. నాది చాలా చిన్న వయసు కావడ ం చేత ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయే వాణ్ని. నాకు ఆ సమయమంతా ఆర్ట్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పెద్ద పెయింటర్‌నైపోవాలన్న ఆకాంక్ష ఆ వయసులోనే నాలో ఎంతో బలంగా ఉండేది. కానీ, ఆ దిశగా నా ప్రయాణం ఎంతో దూరం సాగలేదు

కుంచె జారిపోయింది
చిత్రకళ పట్ల నాకున్న మక్కువను తొలిసారిగా ఇంట్లో అలా వ్యక్తం చేశానో లేదో " ఏడి శినట్లుంది నీ ఆలోచన. పేయింటింగ్ నేర్చుకుని గోడల మీద గీతలు గీసుకుంటూ, సైన్‌బోర్డులు రాస్తూ బతికేస్తావా? లాంటి ప్రశ్నలు నా మీద విరుచుకుపడేవి. "ఆర్ట్ అంటే సైన్‌బోర్డులు రాయడం మాత్రమే కాదు'' అని చె ప్పేంత శక్తి అప్పటికింకా లేదు.

చివరికి ఆర్ట్ నా మనసులో గూడుకట్టుకుపోయిందే తప్ప అది నా చేతుల్లో లేకుండా పోయింది. వేళ్లలోకి రావలసిన కుంచె పక్కకు జారిపోయి ఆ స్థానంలో కెమెరా వాలిపోయింది. అలా నేను 26 ఏళ్లపాటు ఫోటోగ్రాఫర్‌గా పనిచేశాను.

ఫోటోగ్రఫీలో గడిపిన ఆ పాతికేళ్ల జీవితాన్ని ఆర్ట్‌కోసమే వెచ్చించి ఉంటే నిస్సంకోచంగా నేనో అంతర్జాతీయ స్థాయిని అందుకునే వాణ్ని. చివరికి ఎన్నో ఏళ్ల తరువాత అంటే మూడేళ్ల క్రితం తిరిగి ఈ రంగంలోకి ప్రవేశించాను. పెయింటింగ్‌లోకి పూర్తిస్థాయిలో దిగిపోయాను. ఇలా రావడానికి ఒక బలమైన కారణం ఉంది.

నా జీవితంలో ఒక ఉప్పెన
"పదేళ్ల క్రితం నాకు గొంతు క్యాన్సర్ ఉన్నట్లు బయట పడింది. మూడేళ్ల పాటు పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్ కొనసాగింది. క్యాన్సర్ కారణంగా జనరల్ హెల్త్‌కూడా దెబ్బతిన్నది. బిపి, షుగరూ మొదలయ్యాయి. ఒక సారి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఈ స్థితిలో ఫోటో జర్నలిస్టుగా ఉరుకూ పరుగులు నేను చేయలేనని స్పష్టమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అంటే మరో వృత్తి ఏదైనా ఎంచుకోవాలి.

మృత్యువు నీడలో...
నా మట్టుకు నాకు ఎప్పుడో దశాబ్ధాల క్రి తం దూరమైన ఆర్టే పెద్ద ఆలంబనగా కనిపించింది. 26 ఏళ్లపాటు ఫోటోగ్రఫీయే వృత్తిగా సాగిన నా జీవితం మూడేళ్ల క్రితం తిరిగి పెయింటింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఇన్నేళ్ల తరువాతైనా నేను ప్రేమించిన రంగంలోకి ప్రవేశించ గలిగానే అన్న సంతోషమైతే ఉంది. కానీ, ఆ సంతోషం మీద మృత్యు నీడలు కదలాడుతున్నాయి.. క్యాన్సర్‌నుంచి ఒకరకంగా బయటిపడినట్లే అనిపిస్తున్నా ఇది మళ్లీ ఎప్పుడైనా తిరగబెట్టనూవచ్చు. అలా చూస్తే నాకున్న జీవిత కాలం తక్కువే.

అందుకే నాలో ఆవేదన ఎక్కువ. మృత్యువు అనుక్షణం అతి సమీపంగా ఉండడం వల్లే ఎక్కువ వేగంగా పనిచేయగలుగుతున్నానేమో అనికూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో పదివేల స్కెచ్‌లు వేసిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచాడు.

అది చూసి కనీసం నేను ఓ వెయ్యి స్కెచెస్ అయినా వెయ్యొచ్చు కదా అన్న ఐడియా వచ్చింది. అలా స్కెచ్‌లు వేయడం మొదలై ఒక సంవత్సరంలోనే 1000 దాకా స్కెచ్‌లు వేశాను వీటికితోడు ఈ మూడేళ్ల కాలంలో 400 డ్రాయింగ్స్, 150 పేయింటింగ్స్ కూడా వేశాను. ఇప్పుడింక ఆర్టే నా జీవనాధారం అయింది.

దారి మారిపోయి...
"నా ఫోటోగ్రాఫిక్ వర్క్స్ కూడా ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఎన్ని ప్రశంసలు వచ్చినా ఆర్ట్‌లో ఏమీ చేయలేకపోయానే అన్న మనోవ్యధ ఇన్నేళ్లూ దహించివేస్తూనే ఉండిపోయింది. అయితే ఇందుకు తల్లిదండ్రులనే పూర్తిగా బాధ్యుల్ని చేయలేం. వారిని ప్రభావితం చేసిన సమాజపు విలువలు కూడా అందుకు కారణమే.

ఏమైనా సాధారణ సామాజిక విలువల కోసం సృజనాత్మక జీవులను అడ్డుకోవడం మాత్రం సరికాదనే అంటాను. తాము ఎంచుకున్న మార్గంలో అయినవాళ్లు ఆశించిన స్థాయి, వైభవంతో జీవించలేకపోవచ్చు. కానీ, వారు అందులో అద్భుతాలు చేస్తారు. ఆత్మతృప్తితో జీవిస్తారు. ఆ తృప్తిని ఎందరికో పంచుతారు.

ఒకటి మాత్రం నిజం. సామాజిక గౌరవాలూ, హోదాలకూ అతీతంగా సృజనాత్మక జీవులను ప్రోత్సహించగలిగితే విజయాల సంఖ్య కచ్ఛితంగా ఇప్పటికన్నా వేయింతలు పెరుగుతుంది. ''అంటూ ముగించారు.
-బమ్మెర

Saturday, September 18, 2010

ఒక శ్రీకాకుళం లెక్క

ఎన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీములు తింటే ఒక పిల్లవాడికి మొహం మొత్తుతుంది?
ఎన్ని దెబ్బలు తిన్నాక ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది?
ఎన్ని వృత్తులు నాశనమైతే ఒక డిగ్రీ చేతికి వస్తుంది?
ఎన్ని ప్రశంసలు లభిస్తే ఒక రచయిత సంతృప్తి చెందుతాడు?
ఎన్ని గుంటలు పడితే ఒక రోడ్డును ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపిస్తారు?
ఎన్ని ఫ్లైఓవర్లు కడితే ఒక నగరం తన పేరును మార్చుకుంటుంది?
ఎన్ని ఉద్యమాలు జరిగితే ఒక రాష్ట్రం అవతరిస్తుంది?

ఎంత పని చేశాక ఒక శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది?
ఎంత డబ్బు జేబులో ఉంటే ఒక మనిషికి ధైర్యం వస్తుంది?
ఎంత ప్రయాణం పూర్తయితే గమ్యస్థానం ఏమిటో తెలుస్తుంది?
ఎంత స్తబ్ధత తర్వాత ఒక సమాజం మేలుకుంటుంది?
ఎంత అవినీతి జరిగితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు?
ఎంత మంచితనం జతపడితే ఒక సమాజం బాగుపడుతుంది?


***

ఇలాంటి గణాంకాలు కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఎప్పుడు వస్తారో!

***

ఆ మధ్య శ్రీకాకుళంలో - కోటానుకోట్ల మంది వచ్చినారు బాబూ అని ఒకావిడ చాలా గొప్పగా చెప్పింది.
కోటానుకోట్ల మంది ఏమిటే లక్షలాది లక్షల మంది వచ్చారు అన్నదట రెండో ఆవిడ ఇంకా గొప్పగా.
లక్షలాది లక్షల మంది కాదే వేలాది వేల మంది వచ్చారంది ఇదంతా వింటున్న మూడో ఆవిడ మరింత గొప్పగా.
వాళ్లు లెక్కలు తెలియక అలా అంటున్నారనుకుంటున్నారా?
కాని లెక్కలు తెలిసిన అభివృద్ధి శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి లెక్కలే వేస్తున్నారే!

లేటు వయస్సులో గ్రేటు చాటింగ్

ఇదంతా 65 ఏళ్ల జానకమ్మ అమెరికాలోని వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న తన ఇద్దరు మనవలు, ఓ మనవరాలితో చేస్తున్న చాటింగ్ అంటే నమ్మగలరా? ఒక్క జానకమ్మే కాదు ...ఎప్పుడో చిన్నప్పుడు ప్రాథమిక విద్యతోటే చదువాపేసి ఇప్పుడు దూరంగా ఉన్న తమ పిల్లల కోసం ఇంటర్నెట్ సావీలుగా మారుతున్న పెద్దవాళ్లెందరో ఉన్నారు. ఆ విశేషాలు... ఐదవ తరగతి వరకే చదువుకున్న జానకమ్మ దాదాపు ఆ అక్షరాలను కూడా మరిచిపోయిన వయసులో అంటే 60 ఏళ్లకు ఇంగ్లీష్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, చాటింగ్ గట్రా నేర్చుకుని కొంచెం ఖాళీ దొరికితే చాలు కంప్యూటర్ ముందు బిజీ అయిపోతున్నారు. ఇది ఆవిడకు, ఆవిడ పిల్లలకు, మనవలు,మనవరాళ్లకు ఆనందంగానే ఉన్నా... పొద్దస్తమానం కంప్యూటర్‌కే అతుక్కుపోతుంటుందని తాతగారు అదే ఆవిడ హబ్బీ ఈశ్వర్రావు విసుక్కుంటారట.

'ఏంలేదు... పిల్లలు ఇంటర్‌నెట్ గురించి చెప్పిన దాంట్లో ఆయనకు కొన్నే బోధపడ్డాయి, నేను చాలా నేర్చుకున్నాను. ఆ ఉడుకుమోత్తనం చూపిస్తుంటారు నా మీద. ఐ డోంట్ కేర్ అనుకో...వేళకు కాఫీలు అందిస్తూ, భోజనం పెట్టి..మాత్రలు ఇస్తూ..నా బాధ్యత కరెక్టుగానే చేస్తున్నాను. ఖాళీ సమయంలో మాత్రమే కదా... ఇంటర్‌నెట్ ముందుంటా... అయినా ఆయనకు కోపమే. బికాజ్..హి కాంట్ చాట్' అని తాతగారిని ఆటపట్టిస్తూ కాఫీ తేవడానికి వంటింట్లోకెళ్లింది ఆవిడ. 'రాకేమీ కాదు...ఈ వయసులో నాకిప్పుడు అవసరమా అని దృష్టిపెట్టలేదంతే. ఏమీ తెలీకుండానే గవర్నమెంట్ సర్వెంట్‌గా రిటైరయ్యానా..? ఆమె ఇప్పుడిప్పుడే లోకం చూస్తోంది కాబట్టి వింతగా ఉందేమో. రేడియో నుంచి డైరెక్ట్ కంప్యూటర్‌కొచ్చిన బాపతు. మనం అలా కాదు. ఎన్ని చూశాం? ఎంత అనుభవం..' అంటూ ఆవిడ మాటలకు సంజాయిషీతో పాటు తన గొప్పదనాన్నీ చెప్పుకొచ్చారు తాతగారు.

ఇంగ్లీషుతో పాటు ఇంటర్నెట్టూ...
ఈ దంపతులు సికింద్రాబాదు వాసులు. జానకమ్మ గృహిణి. ఈశ్వర్రావు సెక్రటేరియట్‌లో సూపరింటిండెంట్‌గా చేసి రిటైరయ్యారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరబ్బాయిలు. ఒక అమ్మాయి. అబ్బాయిలిద్దరూ అమెరికాలో ఉంటారు. అమ్మాయి కాన్పూర్‌లో ఉంటుంది. వాళ్లతో టచ్‌లో ఉండాలంటే ఫోన్లు, ఇంటర్నెట్టే మార్గాలు వీళ్లకు. 'కాని ఫోన్‌లో మాట్లాడాలంటే మావారికి గట్టిగా చెబితే కాని వినపడదు.

నాకూ అంతేననుకోండి. అయినా పాపం మా పిల్లలు ఫోన్లో అరుస్తూనే ఉంటారు. దానికన్నా మెయిల్ పెట్టుకోవడం, చాటింగ్ చేసుకోవడమే సుఖమనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడో యాభై ఏళ్ల కిందట ఆపేసిన చదువును మావారి ప్రాణం తీసి ట్యూషన్ పెట్టించుకుని మళ్లీ ప్రారంభించాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసే ఓ అమ్మాయి ఇంగ్లీష్‌తోపాటు ఇంటర్నెట్టూ నేర్పింది' అని చెప్పారు జానకమ్మ మురిపెంగా.

'అవి నేర్చుకోడానికి మా ఇంటిల్లిపాది ప్రాణాలను ఎలా తోడిందో కూడా చెప్పమనండి....మా ఇంటికి కంప్యూటర్ వచ్చిన కొత్తలో అయితే పొద్దస్తమానం దానిముందే కూర్చోనేది. సమయానికి అన్నపానీయాల్లేవ్..మందులు మాకులు అందక షుగర్ పెరిగి దాదాపు ఆసుపత్రి పాలైనంత పనైంది నాకు. మా పెద్దబ్బాయి రావాల్సి వచ్చింది అమెరికా నుంచి' కామెంట్ చేశారు ఈశ్వర్రావు.

గెటింగ్ హెడేక్
'అంత సీన్ లేదు. నేను త్వరత్వరగా నేర్చుకున్నానని... ఆయనకు రాలేదని అక్కసంతే'అంటూ కౌంటర్ వేసారు జానకమ్మ. 'అన్నిటికీ ఇలాగే మొండి వాదన. ఇందుగలడు అందులేడనే సందేహం వలదు అన్నట్టుగా దీనికి ఉపయోగం..దానికి లేదు అని కాకుండా ప్రతిదానికి టెక్నాలజీని తోడు పెట్టుకుంటుంది. కంప్యూటర్ సరే...సెల్ కూడా ఎప్పుడూ చేతిలో ఉండాల్సిందే...అదేదో ఆభరణం అయినట్టు.

విషయం ఏంటంటే...నాతో గొడవపడి మాటలు మానేసినప్పుడల్లా సెల్లే మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ టూల్. మాట్లాడకుండా ఎస్సెమ్మెస్‌లు పంపుతుంది... ఫుడ్ రెడి, ఇట్ ఈజ్ ఆన్ ది టేబుల్...హాట్ వాటర్ రెడీ..ఐయామ్ గోయింగ్ టు టెంపుల్..డోంట్ షవుట్ ఐయాం గెటింగ్ హెడేక్ అంటూ. నీ మొహం అని నేనూ పెడతాననుకోండి... అప్పుడు 'మీ కన్నా బాగానే ఉంది' అని రివర్స్ పంపుతుంది. అలాంటప్పుడే ఈ సెల్‌ని కొనిపెట్టిన మా పిల్లలను తిట్టాలనిపిస్తుంది' గోడు వెళ్లబోసుకున్నారు పెద్దాయన.

ఆయనకు రాదు
'నేను పది ఎస్సెమ్మెస్‌లు పంపే లోపు ఆయన ఒక్కటి టైప్ చేస్తారు. సరిగా చేయడం రాదు. మా మనవలు, మనవరాళ్లతో నేను చాటింగ్ చేస్తుంటాను కదా..అందుకే కొంచెం ఫాస్ట్. పైగా వాళ్ల షార్ట్‌కట్ పదాలు నాకూ అలవడ్డాయి. బికాజ్ ఉందనుకోండి.. ఎస్సెమ్మెస్‌లో బి రాసి కాజ్ రాస్తాం కదా..అలా రాస్తే తనకు అర్థం కాదు. ఫర్ యూ కి ఫోర్ అంకె వేసి ఇంగ్లీషు యూ రాస్తే అదీ బోధపడదు. నీ మొహం... మీరు అక్షరాలను, స్పెల్లింగులను అలా ఇష్టమొచ్చినట్టు రాస్తే సరా అంటూ విసుక్కుంటారు. వయసులో ఉన్నప్పుడు చదువు రాదు అని ఎంత ఏడిపించారో ఆ కసి అంతా తీర్చుకుంటున్నానిప్పుడు.

థాంక్స్ టు మై చ్రిల్డన్ అండ్ థాంక్స్ టు టెక్నాలజి' వివరించారు జానకమ్మ. దూరంగా ఉన్న పిల్లలతోనే కాదు ఊళ్లోనే ఉన్న తన స్నేహితులతో కూడా ఇంటర్నెట్ చాటింగ్, మెయిల్స్ పెట్టుకోవడం చేస్తుంటారట ఆమె. అంతేకాదు ఇక్కడ ఏ చిన్న పండగైనా...వాళ్లిద్దరి పుట్టిన రోజులు, పెళ్లిరోజు..నోములు, వ్రతాలు వంటివేవి జరిగినా హ్యాండికామ్‌తో షూట్ చేసి ఆ వీడియోని మెయిల్లో అప్ లోడ్ చేసి పిల్లలకు పంపుతారట. 'పెళ్లయిన కొత్తలో వంటే వచ్చేది కాదు, నేనే దగ్గరుండి నేర్పాను..అలాంటిది ఈ వయసులో చూడండి..ఎలా తయారయిందో' అంటూ నిజంగానే అక్కసు వెళ్లగక్కారు ఈశ్వర్రావు.

టీవీ కన్నా కంప్యూటరే..
జానకమ్మ ఈశ్వర్రావులే కాదు సికింద్రాబాద్‌లోని మరో జంట లలిత, బిట్ల వెంకటేశ్వర్రావులూ అంతే. టెక్నాలజీ ఫ్రెండ్లీయే. వీళ్లకు ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురూ అమెరికాలోనే ఉంటున్నారు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. వీరి జీవితంలోకి టెక్నాలజీ టూల్స్ ఎలా ప్రవేశించాయో చెపుతూ లలిత ' నేను టెన్త్ వరకే చదువుకున్నాను. అదీ అప్పటి చదువు. మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చదివేప్పుడే అంటే ఓ పదేళ్ల కిందటే కంప్యూటర్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత వాడు అమెరికా వెళ్లాక మొత్తం దాని మీదే ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్లతో మాట్లాడాలంటే ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లాల్సిందే.

అలా అలవాటైంది నాకు. అప్‌లోడ్, డౌన్‌లోడ్, స్కానింగ్ లాంటివన్నీ నాకప్పుడే తెలుసు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడ్డం ఎక్కువై మెయిల్స్ పెట్టడం తగ్గింది. అయినా మా కోడళ్లకి కావాల్సిన వంటల రెసిపీలు వంటి వాటిని మెయిల్ చేస్తాను. వీడియోలు తీసి వాటిని అప్ లోడ్ చేస్తాను. నెట్‌లో బాగా అనిపించిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాను. ఖాళీ టైంలో టీవీ కన్న కంప్యూటర్‌తోనే నాకెక్కువ కాలక్షేపం' అని చెప్పారు.

ప్రపంచాన్ని చిన్నదిగా చేసింది
బిట్ల వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ..'నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిటైరయ్యాక న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌లో జాయిన్ అయ్యాను. ఉద్యోగ ధర్మంగా కూడా సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను అప్‌డేట్ చేసుకోవాల్సిందే. కాని నాకు మా పిల్లల ద్వారానే దీని గురించి ఎక్కువ తెలిసింది. దానికి సంబం«ధించిన పదజాలం కూడా మా పిల్లల ద్వారానే అలవాటైంది. మొన్ననే మేము అమెరికా వెళ్లొచ్చాం. వెళ్లే ముందే అక్కడి విషయాలను, విశేషాలను, సమాచారాన్ని నెట్‌ద్వారా తెలుసుకున్నాం. దాంతో అదో కొత్త ప్రదేశంలాగా ఏమీ అనిపించలేదు. టెక్నాలజీ ప్రపంచాన్ని చిన్నదిగా చేసింది'అని చెప్పుకొచ్చారు.

చందమామ కథలూ...
పిల్లల కోసం, పిల్లల ద్వారా అయితేనేం కొత్త విషయాలను తెలుసుకోవడంలో తమకు పరిచయంలేని వస్తువులను వాడడంలో పెద్దలు ఈ తరం పిల్లలతో పోటీపడుతున్నారు . ఇంకా చెప్పాలంటే ఉత్సాహం చూపుతున్నారు. ఎక్కడా మాది పాత తరం అన్న జంకు లేదు. ఎక్కడో సప్త సముద్రాల ఆవల ఉన్న తమ మూడోతరానికి చాటింగ్‌లో చందమామ కథలు, వీడియో క్లిప్పింగుల్లో పండగ సంప్రదాయాలను, సెల్ ఫోన్లో రామాయణ, భారతాలను వినిపించి పనిలో పనిగా సంస్కృతిని కూడా పరిరక్షించేన్నారు.
జూ సరస్వతి రమ
ఫోటోలు: రాజ్‌కుమార్

Tuesday, September 14, 2010

సూర్యకాంతం ఎఫెక్ట్‌

Suryakanthamఒకసారి షూటింగ్‌ నిమిత్తం ప్రముఖ డైరక్టర్‌ పి.పుల్లయ్య తన పద్మశ్రీ ప్రొడక్షన్స్‌ యూనిట్‌తో హైదరాబాద్‌నుండి వైజాగ్‌ హార్బర్‌కు ఆర్టిస్టులతో సహా సూర్యకాంతం కూడా బయలుదేరింది.... ఆ ఫ్లైట్‌ గన్నవరం దగ్గర కొద్దిసేపు ఆగి మళ్లీ వైజాగ్‌కు బయలుదేరింది. అయితే దర్శకుడు పి.పుల్లయ్య ఆందోళనతో రెండు చెవులు ఊరికే తెగ రుద్దేసు కుంటున్నాడు. అది గమనించిన ఎయిర్‌హోస్టెస్‌ పుల్లయ్యతో ‘మరేం భయపడకండి. సూర్యకాంతం గన్నవరం లోనే ఉండిపోయారు. ఆమెను క్షేమంగా ఇంకో ఫ్లైట్‌ ఎక్కించి వైజాగ్‌కు పంపిస్తామంది. దానితో పుల్లయ్య ఒక్కసారిగా నిట్టూర్పు విడిచి ‘ఇందాకటినుంచి సూర్యకాంతం మాటలేమీ ఫ్లైట్‌లో వినపడకపో యేసరికి నాకేదో చెవుడు వచ్చిందని అనుకుని హడలి చచ్చిపోయాను’ అన్నాడట.